Search This Blog

Friday, August 31, 2018

CRICKET

Subramaniam Badrinath represented India in all three formats of the game.

from NDTV Sports - Cricket https://ift.tt/2wz5GrM

CRICKET

The Kerala Cricket Association (KCA) imposed sanctions on 13 players for what it deemed as a "deliberate intention to defame the captain".

from NDTV Sports - Cricket https://ift.tt/2MFmFmD

Sunday, August 26, 2018

ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క బ్యాటరీ లైఫ్ ను పెంచే 10 టిప్స్

              స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ సమస్యలు కామన్‌గా మారిపోయాయి. ఈ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ శాతం మంది యూజర్లు థర్డ్ పార్టీ బ్యాటరీ సేవింగ్ యాప్స్ పై ఆధారపడతున్నారు.కొన్ని సందర్భాల్లో మీరు వాడే యాప్స్ వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్‌ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ వంతు ఏకాగ్రతతో బ్యాటరీ సేవింగ్ మర్గాలను అనుసరించటం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఈ శీర్షిక లో భాగంగా స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఉపయోగపడే 10 బ్యాటరీ సేవింగ్ టిప్స్ ను మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి.




Check The Apps Which Is Using More Power.
ఫోన్‌లో మీరు క్లోజ్ చేసే అప్లికేషన్స్, మీ కళ్ల ముందు కనిపించక పోయినప్పటికి, బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్‌ను వృథాగా ఖర్చు చేసేస్తుంటాయి. ఫోన్ బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఏఏ యాప్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేసుకుంటుందో తెలుసుకోవచ్చు. తద్వారా వాటిని మానిటర్ చేసుకోవచ్చు.ఇలా తెలుసుకోవచ్చు Setting > About phone > Battery use.


Stop Unnecessary Services
అనవసరైమైన సర్వీసెస్ ను ఆపేయండి ఎందుకంటే అది బ్యాటరీ లైఫ్ ను కాజేస్తుంది. రన్నింగ్ సర్వీసెస్ ఆపేయడానికి Settings > Applications > Running services. తరువాతి స్క్రీన్ లో మీరు వారి RAM మొత్తం వాడకంతో సేవల జాబితా కనుగొంటారు. మీరు ప్రస్తుతం ఉపయోగించని సాఫ్ట్వేర్ అప్డేట్, ఈమెయిల్ మరియు ఇతర సేవల వంటి సేవలను ఆపివేయవచ్చు. ఇది యాండ్రాయిడ్ బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది.

 




Turn Off Bluetooth And WiFi After Usage.
వై-ఫై, బ్లుటూత్ వంటి ఫీచర్లు బ్యాటరీ శక్తిని తినేయడం లో ముందు వరసలో ఉంటాయి. కాబట్టి, ఈ ఫీచర్లను అవసరం మేరకే వాడుకోండి. అవసరంలేని సమయంలో టర్నాఫ్ చేసేయండి.
 

Reduce Multitasking
ఒకే సరి మల్టీపుల్ యాప్స్ రన్ చేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అందువల్ల మల్టీ టాస్కింగ్ ను తగ్గించండి.
 

Turn Off Internet After Use
స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉపయోగించిన తరువాత ఎప్పటికప్పుడు Turn Off చేయండి.
 


Turn Off GPS.
స్మార్ట్ ఫోన్ లో GPS ను వాడిన తరువాత Turn Off చేయండి. GPS Turn Off చేయడానికి ఇలా చేయండి Settings > Security and Location > Enable/disable GPS.
 

Turn Off Your Hotspot After Use.
హాట్ స్పాట్ వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతింటుంది . కాబట్టి, ఈ ఫీచర్లను అవసరం మేరకే వాడుకోండి. అవసరంలేని సమయంలో Turn Off చేసేయండి.
 

Decrease Display Brightness Or Disable Auto
ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ద్వారా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఎంతో కొంత బ్యాటరీ ఆదా అవుతుంది. స్ర్కీన్ టైమ్ అవుట్‌ను మరింత తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది. ఫోన్ వైబ్రేషన్స్ టర్నాప్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది. ఫోన్‌లోని అప్లికేషన్‌లను తరచూ అప్‌డేట్ చేసుకోవటం ద్వారా యాప్స్ ఎక్కువ బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేయవు.
 

Turn On Power Saver Mode
మీ ఫోన్‌లో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉన్నట్లయితే, బ్యాటరీ డౌన్ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా ఆ ఫీచర్ యాక్టివేట్ అయ్యే విధంగా ఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకోండి.
 

Avoid Overcharging Of Battery.
మొబైల్ ను ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టకండి.

'MAANDI'వెరైటీ బిర్యానీ.. ఇప్పుడిదొక ట్రెండ్


మారుతున్న ఆహార అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులఉ సరికొత్త రుచులు, కొంగొత్త సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. వెరైటీ డిష్‌లను తయారుచేస్తూ భోజనప్రియులను ఆకర్షిస్తున్నారు. అలాంటి వెరైటీ డిష్‌లలో ‘మండీ’ బిర్యానీ స్పెషల్‌. ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇదొక ట్రెండ్‌. కుటుంబ సమేతంగా, స్నేహితులు ఈ డిష్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బర్త్‌డేలు, మ్యారేజ్‌ డేలు, వీకెండ్‌ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, ఇతర ఆనంద సమయాల్లో మండీ బిర్యానీ స్పెషల్‌ డిష్‌గా సెలక్ట్‌ చేసుకుంటున్నారు.

నయా టేస్ట్‌

విభిన్న సంస్కృతులు రాజధానికి తరలివస్తున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాలు నయా రూపం సంతరించుకుంటున్నాయి. ఆ ప్రభావం స్థానికుల జీవన విధానంపై కూడా పడుతుండటంతో రాజధాని నగరాల్లోని ప్రజల జీవనశైలి మారిపోతోంది. కొత్త సంప్రదాయాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. రాజధానిలో పనిచేసే ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో అనేక మంది వీకెండ్‌ పార్టీలు చేసుకోవడం.. ఎక్కువమంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి సెలవుల్లో బయటకు వెళ్లి తమకు ఇష్టమైన బిర్యానీలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా నగరంలో రకరకాల రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. వాటి నిర్వాహకులు కొత్తకొత్త వెరైటీ డిష్‌లతో ఆకట్టుకుంటున్నారు. వాటిలో మండీ స్పెషల్‌ బిర్యానీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

ఒకే కంచంలో కలిసిమెలిసి..

సాధారణంగా మనం భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే డైనింగ్‌ టేబుల్స్‌పైనే వడ్డిస్తారు. స్టార్‌ హోటళ్లు మొదలు చిన్నచిన్న రెస్టారెంట్ల వరకు ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి. ఎవరికిష్టమైన ఆహారాన్ని వారు ఆర్డర్‌ చేసుకుని ఎవరి ప్లేటులో వారు తినడం చూశాం. కానీ, మండీ బిర్యానీ ఇందుకు పూర్తి భిన్నం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వెళితే.. అందరికీ కలిపి ఒక ఎత్తుపీటపై ఒకే కంచంలో చికెన్‌, మటన్‌తో చేసిన బిర్యానీ వడ్డిస్తారు. ఆ కంచం చుట్టూ కూర్చుని కలిసి తినడమే దీని ప్రత్యేకత. ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఇలా మనుషుల సంఖ్య పెరిగేకొద్దీ కంచం సైజు కూడా పెరుగుతుంది. గరిష్టంగా ఐదుగురు కలిసి ఒకే కంచంలో తినేందుకు వీలుగా రెస్టారెంట్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

బిర్యానీ పార్టీలు చేసుకునేవారు ఎక్కువ సంఖ్యలో వెళితే అందుకనుగుణంగా ఏర్పాట్లుంటాయి. ఆహ్లాదకర వాతావరణంలో మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. అందరూ కలిసి కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ.. ఇష్టమైన బిర్యానీ తింటూ మధురానుభూతిని పొందుతున్నారు. కాలేజీ ఫ్రెండ్స్‌ అయితే.. మండి బిర్యానీ డిష్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం విజయవాడలోని టిక్కిల్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన బార్కాస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు తొలిసారిగా ఈ మండీ బిర్యానీ డిష్‌ను నగరవాసులకు పరిచయం చేశారు. క్రమంగా ఇది క్రేజీగా మారడంతో విజయవాడ, గుంటూరు నగరాల్లో పలుచోట్ల కొత్తగా వెలిశాయి.

తయారీ ఇలా..

హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, ఇతర బిర్యానీలకు పూర్తి భిన్నంగా మండీ బిర్యానీని తయారు చేస్తారు. బొగ్గుల పొయ్యి మీద చికెన్‌ (కోడి తొడ)ను వెన్నతో కాలుస్తూ రోస్ట్‌ చేస్తారు. బొగ్గులపై కాల్చడం వల్ల దాని రుచే వేరుగా ఉంటుంది. కాజు పేస్ట్‌తో మటన్‌ను కూడా అంతే ప్రత్యేకంగా తయారుచేస్తారు. బాసుమతి బియ్యంతో విడిగా బిర్యానీని తయారుచేస్తారు. దీని తయారీలోనూ ఎలాంటి నూనెలు వినియోగించరు. ప్రత్యేకంగా చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో చేసిన మండీ బిర్యానీ టేస్టే వేరు. ఇలా విడివిడిగా చేసిన బిర్యానీ, చికెన్‌, మటన్‌, ప్లేటులో పెట్టి.. సన్నగా తరిగిన కీరా, క్యారెట్‌, ఆనియన్‌ స్లైస్‌ అలంకరించి అందిస్తారు. ఈ బిర్యానీని తింటున్నప్పుడు చేతికి అంటుకోదు. అందరూ కలిసి తినడం వల్ల ఆహార పదార్థాల వృథా తగ్గుతుంది. ఆత్మీయులతో కలిసి తిన్నామన్న సంతృప్తి మిగులుతుందని బిర్యానీ ప్రియులు చెబుతున్నారు. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయని చెబుతున్నారు. రెస్టారెంట్లకు వెళ్లి మండీ బిర్యానీ తినలేని వారికి డోర్‌ డెలివరీ, ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అరబిక్‌ సంప్రదాయమే..

‘మండీ’ అరబిక్‌ పదం. అందరూ కలిసి ఒకే కంచంలో తినడం అరబిక్‌ సంప్రదాయం. యెమన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, సోమాలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉంది. క్రమంగా అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరిస్తోంది. నవ్యాంధ్రలోనూ మండీ బిర్యానీ పాపులర్‌ అయ్యింది. అరబ్‌లో ఎక్కువగా మటన్‌తో మండీ బిర్యానీ తయారుచేస్తారు. ఇక్కడ మటన్‌, చికెన్‌తో కూడా తయారు చేస్తున్నారు.

Friday, August 24, 2018

స్వర్గం చూపిస్తానని.. గదికి పిలిచి అబ్బాయిని కుమ్మేసిన అమ్మాయిలు.. ఎందుకు..?

అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి. ఇదేం సినిమా టైటిల్ కాదు. అలాంటి ఇద్దరిని కలిపింది ఇన్‌స్టాగ్రామ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరి మధ్యా అంతా సాఫీగానే సాగింది. ఇనస్ట్రాగ్రామ్‌లో ఒకరి ఫోటోను మరొకరు షేర్ చేసుకోవడం వరకు వచ్చింది. అమ్మాయి ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా బాగా కలగలిసి పోవడంతో బాగా ధైర్యం పెంచుకున్నాడు ఆ అబ్బాయి. ఇక తాను ఏదగడినా ఇంచేస్తుందని గట్టిగా ఫిక్సయిపోయాడు.

వరంగల్ నగరానికి చెందిన యువకుడు రాజ్. యువతి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్న వాణిశ్రీ. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పీకల్లోతు చిట్ చాట్‌లు, షేరింగ్‌లు. అంతే ఇక తన మనస్సులోని ప్రేమను ఆ అమ్మాయికి చెప్పేశాడు యువకుడు. ఎందుకో ఆమె నో చెప్పింది. దీంతో యువకుడికి తిక్కరేగింది.

ఈ పరిచయాన్ని పడకగది వరకు తీసుకెళ్ళాలన్నది యువకుడి ఆలోచన. అతని వక్రబుద్దిని గుర్తించిన యువతి అతని ప్రేమకు నో చెప్పేసింది. అయినా సరే యువకుడు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఆమెను ముగ్గులో దించాలని గట్టిగా ఫిక్సయ్యాడు. ప్రేమించకపోతే పోయావు. నాతో పడకపంచుకో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాడు. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని యువతి పరిపరి విధాలుగా ఆలోచించింది.

ఇతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఎక్కడ రావాలో కూడా నువ్వే చెప్పు అంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ యువతి సరే కలుద్దామంటూ మెసేజ్ పెట్టి హైటెక్ సిటీలోని హాస్టల్‌కు రమ్మంది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు. హాస్టల్ గదిలోకి తీసుకెళ్ళిన యువతి తన స్నేహితులతో కలిసి చావబాదింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్ పోలీస్టేషన్‍కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న యువతి కూడా అతనిపై ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఇది మొత్తం రెండు కుటుంబాల కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీస్టేషన్‌కు వచ్చి కాంప్రమైజ్ అయి అక్కడి నుంచి ఇద్దరినీ తీసుకెళ్ళిపోయారు. సోషియల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త ఉండాలని ఈ ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది.

ఇండియా మార్కెట్లోకి దూసుకొస్తున్న షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ Poco F1

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. Poco F1 పేరుతో మార్కెట్ లోకి రాబోతుంది .ఈ నేపథ్యంలో ఈ Poco F1 ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు ఇండియాలో జరగనుంది. Poco సిరీస్ నుంచి రాబోయే మొదటి స్మార్ట్ ఫోన్ కావడం వలన షియోమి అభిమానులు ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో అధునాతనమైన టెక్నాలజీ తో ఈ ఫోన్ ను తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది.మొదటి సారిగ లిక్విడ్ కాలింగ్ సిస్టం అనే సరికొత్త టెక్నాలజీనీ ఇందులో ప్రవేశపెట్టినట్ట కంపెనీ తెలిపింది.మరికొద్ది రోజుల్లో ఈ Poco F1 ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఎక్సక్లూసివ్ గా లభిస్తుంది.
             

Master Of Speed అనే # ట్యాగ్ తో....
Master Of Speed అనే # ట్యాగ్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ # ట్యాగ్ బట్టే తెలిసిపోతుంది ఫోన్ పనితీరు ఎంత వేగంగా ఉండబోతుందో.

   
రెండు వేరియంట్లలో....
రెండు వేరియంట్లలో....
మొదటి వేరియంట్ 6జీబీ ర్యామ్,64జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది రెండవ వేరియంట్ 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది.
ధర....
షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Poco F1 ధర పై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ మొదటి వేరియంట్ ధర సుమారు రూ.34,000 ఉండవచ్చని అలాగే రెండవ వేరియంట్ ధర సుమారు రూ.36,000 ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
   
పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్...... 
పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్......
ఈ పోకోఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు రాబోతోంది. పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్ Poco F1 పేరుతో ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవుతుంది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ క్యారీ చేయబోతోంది.
   
లిక్విడ్ కూలింగ్ సిస్టమ్..... 
లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....
ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేయబోతోన్న ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హీటింగ్‌ను నిరోధించి ఫోన్ పనితీరును రెట్టింపు చేస్తుంది.
   
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్ కూడిన 6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో షియోమీ ఏర్పాటు చేసింది . ప్రీమియమ్ మెటల్ యునిబాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఆర్ ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది . యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
   ఇ

Pocophone F1 ఫీచర్స్.... 
Pocophone F1 ఫీచర్స్....
6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

బడ్జెట్ ధరలో లభించే టాప్ టెన్ బెస్ట్ కెమెరా ఫోన్లు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాలైన ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో మంచి క్వాలిటీ కెమెరా గల ఫోన్లు ఏవంటే కొన్ని చాలా తక్కువ కనిపిస్తాయి.ఈ శీర్షికలో భాగంగా బడ్జెట్ ధరల్లో లభించే బెస్ట్ కెమెరా ఫోన్స్ మీకు తెలుపుతున్నాము . ఓ స్మార్ట్ లుక్కేయండి.

 Samsung Galaxy J6(ధర రూ.12,850)
Samsung Galaxy J6(ధర రూ.12,850)
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
Asus Zenfone Max Pro M1(ధర రూ.10,999)
Asus Zenfone Max Pro M1(ధర రూ.10,999)
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

   
Nokia 6.1(ధర రూ.13,262)
Nokia 6.1(ధర రూ.13,262)
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.
   
Honor 7X (ధర రూ.11,044)
Honor 7X (ధర రూ.11,044)
5.93 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.36గిగాహెడ్జ్ Octa-Core kirin ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
Oppo A3s(ధర రూ.10,347)
Oppo A3s(ధర రూ.10,347)
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
Honor 9 Lite(ధర రూ.10,999)
Honor 9 Lite(ధర రూ.10,999)
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
Vivo Y83(ధర రూ.14,240)
Vivo Y83(ధర రూ.14,240)
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Mediatek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1. Funtouch ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
Vivo Y71(ధర రూ.10,348)
Vivo Y71(ధర రూ.10,348)
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3360 ఎంఏహెచ్ బ్యాటరీ.
   
RealMe 1(ధర రూ.13,990)
RealMe 1(ధర రూ.13,990)
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 

Thursday, August 23, 2018

DHOLAVEERA ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం

ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం
Telugu Nativepalnet 22 Aug. 2018 14:57
ధోలావీరా చరిత్ర అంటే ఇష్టపడేవారు సందర్శించే పర్యాటక స్థలాల్లో మొదటి వరుసలో ఉంటుంది. ఇది గుజరాత్ జిల్లాలోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్ బెట్ వద్ద ఉన్న పురావస్తుశాఖ కేంద్రం. ఇక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న ధోలావీరా అనే గ్రామం వల్ల ఈ ప్రాంతాన్ని కూడా ధోలావీరా అని పిలుస్తారు.

సింధు లోయనాగరికతకు చెందిన ఈ ప్రాంతంలో లక్షల కోట్ల రుపాయల విలువచేసే బంగారు, వెండి, వజ్రాలు ఉన్నయని చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన దారి ఒక విచిత్ర లిపిలో ఉందని కొంతమంది చెబుతారు.

అయితే పురావస్తుశాఖ అధికారులు అది నిధికి సంబంధించిన రాత కాదని కేవలం ధోలావీరా ప్రాంతంలో అప్పటి ప్రజలు వినియోగించే భాష మాత్రమేనని చెబుతారు. ఈ నిధి గొడవను పక్కన పెడితే చరిత్ర గురించి తెలుసుకోవడంతో పాటు ఈ ధోలావీరా చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...



ధోలావీరా

P.C: You Tube

ధోలావీరా భారత దేశంలోని సింధులోయ నాగరికతకు చెందిన ప్రముఖ స్థలాల్లో ఒకటి. ఈ ధోలావీరా రాన్ ఆఫ్ కచ్ లోని కచ్ ఎడారి వన్యప్రాణి సంరక్షణాలయంలోని ఉంది. ఈ ధోలావీరాకు ఇరువైపులా మన్ సార్, మన్ హార్ అనే రెండు వాగులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 1967లో భారత పురాతత్వశాఖ సంస్థ డైరెక్టర్ జనరల్ జేపీ జ్యోషి కనుగొన్నారు.


ధోలావీరా

P.C: You Tube

ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ మొత్తం 13 తవ్వకాలు జరిపారు. ఇందులో పట్టణ ప్రణాళిక, వాస్తురీతులు వెలుగులోకి వచ్చాయి. అనేక ముద్రంలు, పూసలు, జంతువుల ఎముకలు, వాటితో చేసిన శిల్పాలు, ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా బంగారు, వెండి, మట్టి ఆభరణాలు, కంచుపాత్రలు కూడా లభించాయి.


ధోలావీరా

P.C: You Tube

పురావస్తు శాఖ అధికారుల అంచనా ప్రకారం ధోలావీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబ్, పశ్చిమాసియా జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేది. ఈ ధోలావీరా లోథాల్ కంటే పురాతనమైనది. మొత్తం 48 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ధోలావీరా పట్టణం ఉంది. ఇక్కడ నిర్మాణాలన్నీ రాతివే. అయితే సింధు లోయ స్థలాలు దాదాపు అన్నింటిలోనూ ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి.


ధోలావీరా

P.C: You Tube

ధోలావీరాలో నీటి నిల్వ కోసం వారు అనుసరించిన విధానాలు ప్రస్తుతం ఆ రంగంలోని శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తటాకాలతో కూడిన నీటి పొదుపు వ్యవస్థ. నీటి పొదువు విషయానికి సబంధించి ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిలో కంటే ఈ విధానం అత్యంత ప్రాచీనమైనది.


ధోలావీరా

P.C: You Tube

ఏళ్ల కొద్ది వర్షాలు పడని ఎడారి ప్రదేశమైన కచ్ ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిర్మించినట్లు పురావాస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిపిన తవ్వకాల్లో 73.4 మీటర్ల పొడవు, 29.3 వెడల్పు, 10 లోతును కలిగిన చతుర్భుజాకారపు దిగుడుబావి. ఇది మొహెంజదారోలోని స్నానఘట్టం కంటే మూడు రెట్లు పెద్దది.


ధోలావీరా

P.C: You Tube

అదే విధంగా ఒక పెద్ద చక్రాకార నిర్మాణం కనుగొన్నారు. ఇది స్మారకం కాని సమాధి కాని అయి ఉండవచ్చునని చెబుతారు. ఈ నిర్మాణంలో చక్రంలోని ఆకుల్లాగా మట్టి గోడలున్నాయి. మెత్తటి రాతిలో చెక్కిన తల, కాళ్లు లేని ఒక మగ మనిషి రూపం, మట్టి ముద్రలు, గాజులు, ఉంగరాలు, పూసలు, చెక్కిన ప్రతిమలు కూడా కనిపిస్తాయి.


ధోలావీరా

P.C: You Tube

అదేవిధంగా రాతిలో నిర్మించిన ఏడు అర్థగోళాకార నిర్మాణాలను ధోలావీరాలో కనుగొన్నారు. వీటిలో రెండింటిలో వివరంగా తవ్వకాలు జరిపారు. ఒకటి ఆకులున్న చక్రంలాగా ఉండగా, రెండవది ఆకుల్లేని చక్రం లాగా ఉంటుంది. వాటిలో ఖనన సంబంధ మట్టి కుండలు ఉన్నాయి.


ధోలావీరా


P.C: You Tube

అంతేకాకుండా రాగి అద్దం, రాగి తీగకు పూసలను గుదిగుచ్చి తయారు చేసిన ఒక గొలుసు, ఒక బంగారు గాజు, బంగారు రేకు, ఇతర పూసలు కూడా ఇక్కడ కనిపించాయి. ఈ వస్తువలన్నింటినీ సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ నిర్మాణాలు తొలి బౌద్ధ స్థూపాలను పోలి ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.


ధోలావీరా


P.C: You Tube

హరప్పన్లు మాట్లాడిన భాష గురించి ఎవరికీ తెలియదు. వారి లిపిని కూడా ఇంతవరకూ ఎవరూ చదవలేకపోయారు. దానిలో దాదాు 400 ప్రాథమిక గుర్తులు ఉన్నట్లు చెబుతారు. ఈ రాత కుడి నుంచి ఎడమకు రాసేవారు. శాసనాలు ఎక్కువగా ముద్రల మీద రాగి పలకల మీద ఉన్నాయి. ఒక వేల ఈ భాష మీకు చదవడం వస్తే లక్షల కోట్ల విలువచేసే సంపదకు సంబంధించిన మార్గం తెలుస్తుందని భావిస్తున్నారు.


ధోలావీరా


P.C: You Tube

ఈ ధోలావీరాలో కోట, మధ్యపట్టణం, దిగువ పట్టణం వంటి భాగాలను మనం గమనించవచ్చు. కోటకు జమిలి బురుజుల ద్వారా రక్షణ ఏర్పరిచారు. మధ్య, దిగువ పట్టణాల్లో ప్రభుత్వ ఉధ్యోగులు, సాధారణ ప్రజలు నివశించేవారు. ఇక ఇక్కడ లభించిన వస్తువులను సందర్శకులు చూసే ఏర్పాటు చేశారు.

LATEST NEWS

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఓ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం రావడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. సుమారు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. విమానాశ్రయం నుంచి క్లియరెన్స్ రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2BDiXEN
via IFTTT

Tuesday, August 21, 2018

KALESHWARAM NEWS

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
రిపోర్టింగ్: బళ్ల సతీశ్, షూట్ అండ్ ఎడిట్: నవీన్ కుమార్
బీబీసీ ప్రతినిధులు
7 జూలై 2018
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter షేర్ చేయండిhttps://youtu.be/p7Iegb-Zw-A
కాళేశ్వరం ప్రాజక్టుImage copyrightKIPL BARRAGE 2
గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ... రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్తగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం చేపట్టిన భూసేక‌ర‌ణ క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు.
నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు ఊహించని స్థాయిలో పేరొచ్చింది. దీంతో ఇది పర్యటక ప్రాంతంగానూ మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు.
ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలేంటి? ఇతర సాగు నీటి ప్రాజెక్టులకు మించి దీనికున్న ప్రత్యేకతలు ఏమిటి?
‘24 గంటల కరెంట్ మాకొద్దు’ అంటున్న తెలంగాణ రైతులు
వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?


Media captionవీడియో: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మిస్తున్నారో చూడండి
గోదావరి వైపు చూపు.. పాత ప్రాజెక్టుకు కొత్త రూపు
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వం రీడిజైన్ చేయించింది.
ముందుగా అనుకున్న‌ట్టు ప్రాణ‌హిత న‌దిపై కాకుండా కాస్త కింద‌కు, ప్రాణ‌హిత న‌ది గోదావ‌రిలో క‌లిసిన త‌రువాత‌ ప్ర‌ధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.
ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది.
తెలంగాణ- మ‌హారాష్ట్ర స‌రిహద్దుల్లోని గోదావ‌రి నుంచి ద‌క్షిణాన హైద‌రాబాద్, చిట్యాల‌, షామీర్‌పేట వ‌ర‌కు నీళ్లొచ్చేలా ఈ కొత్త‌ డిజైన్ ఉంది.
అధిక దిగుబడే వ్యవసాయ సంక్షోభానికి కారణమా!
కొలువుల కోసం ‘కొట్లాట’ : ఉద్యోగం వస్తదా? రాదా?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
కన్నెపల్లిలో నిర్మిస్తున్న ఓపెన్ పంప్ హౌజ్
తాగునీటికి.. పారిశ్రామిక అవసరాలకు కూడా..
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.
కొత్త ఆయ‌కట్టు కాకుండా శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయ‌ర్ మానేరు, అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టుల‌ను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించ‌డానికి కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు త‌వ్వారు.
వీటి ద్వారా మిగిలిన నీటిని త‌ర‌లించి ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తారు. అంటే ఆ రిజ‌ర్వాయ‌ర్ల కింద ఉన్న 18.82 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నిక‌రంగా నీరందించ‌వ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది.
వీటికి అద‌నంగా, పాత ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్ర‌తిపాదించిన చోటే అప్ప‌టికంటే ఎత్తు త‌గ్గించి మ‌రో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 ల‌క్ష‌ల ఎక‌రాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.
రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
తెలంగాణలో బహిరంగ మలవిసర్జనపై డ్రోన్ నిఘా!
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
మేడారం ట్యాంక్‌
గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా..
న‌దిలో నీటి ప్ర‌వాహాన్ని ఆపడానికి క‌ట్టే నిర్మాణాన్ని బ్యారేజ్ అంటారు. న‌దిలోనే జ‌లాశ‌యం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు. (ఉదాః నాగార్జున సాగ‌ర్ డామ్, ప్ర‌కాశం బ్యారేజ్).
ఇప్పుడు గోదావ‌రిపై మూడు చోట్ల (మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం) బ్యారేజ్‌లు క‌డుతున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మ‌రో బ్యారేజ్ ముందుకు వ‌దిలేలా ఏర్పాటు ఉంటుంది. (గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో, ఎగువ‌కి) ఇలా మేడిగ‌డ్డ నుంచి ఎల్లంప‌ల్లి వ‌ర‌కూ నీటిని తెస్తారు. అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా నీటిని పంపిస్తారు.
అలా నీరు సొరంగాలు, కాలువ‌ల్లో ప్ర‌వ‌హించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోప‌ల‌, బ‌య‌ట ప్ర‌యాణించి వేర్వేరు కొత్త, పాత జ‌లాశ‌యాలను క‌లుపుతూ ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కూ వ‌స్తుంది.
ఒక్క‌ముక్కలో చెప్పాలంటే అవ‌స‌రానికి అనుగుణంగా గోదావ‌రి నీటిని కాలువ‌లోకి మ‌ళ్లించి, గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో (వెన‌క్కు) తీసుకెళ్లి మ‌ళ్లీ గోదావ‌రిలోనే క‌లుపుతారు. ఇదంతా కాళేశ్వ‌రం లింక్ -1 లో జ‌రుగుతుంది.
అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా అనుకున్న చోటుకు త‌ర‌లిస్తారు. ఇందుకోసం వివిధ చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజ‌ర్వాయ‌ర్ల‌ను, కాలువ‌ల‌ను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు, రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించారు.
ఈ మొత్తం ప‌నిని లింకులుగా, తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి.
ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. లింక్ 1, లింక్ 2 ల‌లో మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు, ధ‌ర్మారం, రామ‌డుగు గ్రామాల ద‌గ్గ‌ర్లో భూగ‌ర్భంలో నిర్మిస్తోన్న పంపుహౌజులు ఉంటాయి.
ఒంటి చేత్తో సిరుల పంట పండిస్తున్నాడు!
తెలంగాణ: ఉడత తోక అంత పని చేసిందా?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
జలాశయాల్లోని నీటిని తోడే మోటార్లకు ఉపయోగించి స్టాట‌ర్‌లోని ఒక భాగం ఇది.
'అవసరమైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి అందిస్తాం'
తాత్కాలిక రాజ‌కీయ ల‌బ్ధి కోసం కాకుండా దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌నం కోసమే భారీ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి టి.హ‌రీశ్ రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ "తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు.
అందుకే ఇంజినీర్లు, మేధావులు, నీటిపారుదల శాఖతో సీఎం కేసీఆర్ తీవ్రంగా చ‌ర్చించి కాళేశ్వ‌రం డిజైన్ రూపొందించారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణ‌ను స‌శ్య‌శ్యామ‌లం చేయాల‌న్న ఆలోచ‌న‌తో ప‌నిచేస్తున్నాం'' అని తెలిపారు.
భ‌విష్య‌త్తులో అవ‌స‌రమనుకుంటే మరో టీఎంసీ నీటిని తోడ‌టానికి వీలుగా కావ‌ల్సిన సివిల్ వ‌ర్క్స్ ఇప్పుడే చేసి పెట్టామని, అవ‌స‌రమైతే కృష్ణా పరివాహ‌క ప్రాంతానికి కూడా నీరు పంప‌డానికి ఆటోమేటిగ్గా మూడో పంపు బిగించేయ‌వ‌చ్చని హ‌రీశ్ రావు చెప్పారు.
తెలంగాణ: మోదీజీ.. తలుపులు మూస్తే తప్పేంటి?
తెలంగాణ: విలీనం నుంచి విభజన దాకా..
కాళేశ్వరం ప్రాజక్టుImage copyrightKIPL BARRAGE 2
ప్ర‌త్యేక‌త‌లు
మొత్తం 20 జిల్లాల‌కు సాగు, తాగు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.
పాత ప్రాజెక్టుపై 2008 నుంచి 2014 వ‌ర‌కు రూ.7 వేల కోట్లు ఖ‌ర్చు అయింది.
కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని లిఫ్టుల నిర్వ‌హ‌ణ‌కు 4,600 మెగావాట్ల క‌రెంటు కావాలి.
కొత్త బ్యారేజీల వ‌ల్ల గోదావ‌రిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరుంటుంది.
సాగునీటి ప్రాజెక్టుల‌ను నేరుగా నీటిపారుద‌ల శాఖ చేప‌డుతుంది. కానీ, కాళేశ్వ‌రం మాత్రం కార్పొరేష‌న్ కింద‌ చేస్తున్నారు.
ఇందుకోసం కాళేశ్వ‌రం ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ‌ను ఏర్పాటు చేసారు.
ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 లు అత్యంత వేగంగా జ‌ర‌గుతున్నాయి. వచ్చే వేస‌వి పంట‌కు వాటి ద్వారా నీరివ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది.
దేశంలోని మిగిలిన సాగునీటి ప్రాజెక్టుల‌తో పోలిస్తే ఎక్కువ ఖ‌ర్చుతో ఒక రాష్ట్రం సొంతంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది.
‘టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోంగనే అనర్హులైపోతరా? ఇదేం అన్యాయం?’
‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
రామడుగులో నిర్మిస్తున్న పంప్‌హౌజ్ విహంగ వీక్షణం
ఇంజినీరింగ్ ప్రాధాన్య‌త ఏంటి?
కాళేశ్వ‌రం ప్రాజెక్టుల్లో అతి ముఖ్య మైన‌ అంశాలుగా ట‌న్నెల్స్(సొరంగం), స‌ర్జ్ పూల్, భారీ పంపులు, గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్‌లను చెప్పుకోవాలి.
తెలంగాణలో గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం ద‌క్క‌న్ పీఠ‌భూమి మీద ఉండటంతో న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాల్సిందే. దీన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్(ఎత్తిపోత‌లు) అంటారు.
న‌ది నుంచి నీరు కాలువ‌లోకి రావ‌డం, అక్క‌డి నుంచి సొరంగం ద్వారా ప్ర‌యాణించడం. అక్క‌డ భూమిలోప‌ల ఉన్న పంపుల‌ నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్క‌డ జ‌రిగే ప్ర‌క్రియ‌. ఇందుకోసం ఈ 4 ప్ర‌త్యేక నిర్మాణాలు అవ‌స‌ర‌మ‌య్యాయి.పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
తిట్టారంటే జైలుకే: తెలంగాణ ప్రభుత్వ చర్యతో లాభమెంత? నష్టమెంత?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
ట‌న్నెల్స్
ట‌న్నెల్స్: భూసేక‌ర‌ణ త‌గ్గించ‌డానికి, భూమి ఎత్తుప‌ల్లాల స‌మ‌స్య‌ల‌ను త‌ప్పించుకోవ‌డానికి భూగ‌ర్భంలో కాలువ‌లు నిర్మించారు. భూమి కింద ప‌ది మీట‌ర్ల వ్యాసంతో ఈ ట‌న్నెల్స్ నిర్మించారు. అంటే ఒక్కో ట‌న్నెల్లో ఒకేసారి నాలుగు కార్లు ప్ర‌యాణించవ‌చ్చ‌న్న‌మాట‌.
ఇలా మొత్తం 203 కిలోమీట‌ర్లు పొడ‌వైన ట‌న్నెల్స్ నిర్మిస్తున్నారు. ప్ర‌పంచంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కానీ, నీటిని త‌ర‌లించ‌డానికి ఇంత పెద్ద, పొడ‌వాటి సొరంగాలు ఎక్క‌డాలేవ‌ని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
తెలంగాణ: బైక్‌పై ఆరు దేశాలు చుట్టొచ్చిన యువతులు!
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
స‌ర్జ్ పూల్
స‌ర్జ్ పూల్: ట‌న్నెల్స్ నుంచి వ‌చ్చిన నీటిని నేరుగా పంపులు తోడ‌వు. నీటి హెచ్చుత‌గ్గుల వ‌ల్ల పంపుల్లో స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డం కోసం ఆ నీటిని చిన్న జ‌లాశ‌యం లాంటి దాంట్లో నిల్వ చేయాలి. ఎత్తిపోతల ప‌థ‌కాల్లో ఇది అనివార్యం. ఆ జ‌లాశ‌యం లాంటి నిర్మాణం భూమిపైన ఉంటే 'ఫోర్ బే' అనీ, భూమిలోప‌ల ఉంటే 'స‌ర్జ్ పూల్' అనీ అంటారు.
భూమిలోప‌ల ఉండే చిన్న‌సైజు రిజ‌ర్వాయ‌రే స‌ర్జ్ పూల్ అన్నమాట‌. ఈ ప్రాజెక్టులో 2 స‌ర్జ్ పూల్స్ నిర్మిస్తున్నారు. వీటి నుంచి పంపుల్లోకి నీరు వెళుతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే కొండ కింద, భూమి లోప‌ల నేల‌ను, రాళ్ల‌ను తొలిచి చెరువులు క‌డుతున్నార‌న్న‌మాట‌.
నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య: ‘‘తగ్గుతోంది, కానీ చేయాల్సింది చాలా ఉంది’’
హైకోర్టు విభజన ఇంకెంత దూరం?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
పంపులు
పంపులు: నీరు తోడుకునే పంపులు అంద‌రికీ తెలిసిన‌వే. పంపుకు మోటార్ బిగిస్తే నీరు వ‌స్తుంది. మ‌న ఇంట్లో, పొలాల్లో ఉండే పంపుల్లాంటివే ఇవి. కానీ, ఇక్క‌డ వాడే పంపులు ఒక్కోటీ చిన్న‌ భ‌వ‌నం అంత ఉంటాయి. ఇక్క‌డ వాడే మోటార్‌లోని స్టార్టర్ భాగాన్ని మూడు ముక్క‌లు చేస్తే ఒక ముక్క‌ను ఒక పెద్ద లారీలో ప‌ట్టుకెళ్లాలి.
కాళేశ్వ‌రంలో వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు.
ఈ ట‌న్నెల్, స‌ర్జ్ పూల్, పంపులే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
భూసేకరణ చట్టం: ఏ నిబంధనలను సవరిస్తున్నారు? ఎలా సవరిస్తున్నారు? ఎందుకు సవరిస్తున్నారు?
'పురోహితులకు తెలంగాణ ప్రభుత్వం కట్నమిస్తోందా!'
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
ధ‌ర్మారం ద‌గ్గ‌ర్లోని భూఅంతర్భాగంలో నిర్మిస్తున్న గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్
గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్
మండ‌ల కేంద్రాల్లో క‌రెంటు స‌ర‌ఫ‌రా చేసే స‌బ్ స్టేష‌న్లు చూస్తుంటాం. అవి సాధార‌ణ సామ‌ర్థ్యంతో ఉంటాయి. అలా కాకుండా 400/11 కేవీ క‌రెంటు స‌బ్ స్టేష‌న్లు ఎక్కువ సామ‌ర్థ్యంతో ఉంటాయి.
ఇవి నిర్మించ‌డానికి 60 ఎక‌రాల స్థ‌లం కావాలి. అయితే ధ‌ర్మారం ద‌గ్గ‌ర్లో నిర్మిస్తోన్న పంపుహౌజు స‌రిగ్గా ఒక కొండ కింద ఉంది. ఆ పంపుహౌజుకు క‌రెంటు ఇవ్వ‌డానికి స‌బ్ స్టేష‌న్ కావాలి.
కొండ పైన స‌బ్ స్టేష‌న్ నిర్మించ‌డం క‌ష్టం. స్థ‌లం కొర‌త‌. దీంతో భూమి లోప‌లే సబ్ స్టేష‌న్ నిర్మించాల్సి వ‌చ్చింది. భూమిలోప‌ల 60 ఎక‌రాలు తొల‌చడం, స‌బ్ స్టేష‌న్ నిర్మించ‌డం అసాధ్యం.
దీనికోసం గ్యాస్ ఇన్సులేటెడ్ సాంకేతికతను వాడుతున్నారు. అంటే స‌బ్ స్టేష‌న్ల‌లోని ట్రాన్స్ఫార్మ‌ర్ల మ‌ధ్య ఖాళీ స్థ‌లం పెద్ద‌గా అవ‌స‌రం లేకుండా ద్ర‌వ రూపంలోని గ్యాసుల‌ను వాడ‌తారు.
ఎస్.ఎఫ్.6 (స‌ల్ఫ‌ర్ హెక్సాఫ్లోరైడ్) ను ఇన్సులేట‌ర్‌గా వాడి భూమిపైన 60 ఎక‌రాల్లో నిర్మించాల్సిన స‌బ్ స్టేష‌న్ భూమి లోప‌ల రెండెక‌రాల కంటే త‌క్కువ స్థ‌లంలో నిర్మిస్తున్నారు. దీనివ‌ల్ల ఖ‌ర్చు రెండున్న‌ర రెట్లు పెరుగుతోంది. ఓ జ‌ర్మ‌న్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది
గ్రానైట్ రాయితో పని సులువైంది'
లిఫ్టుల‌కు సంబంధించి ప్ర‌పంచంలో ఇదే పెద్ద ప్రాజెక్ట్‌ అని కాళేశ్వ‌రం ప్రాజెక్టు లింక్ 1 & 2 చీఫ్ ఇంజినీర్ వేంక‌టేశ్వ‌ర్లు బీబీసీకి చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''పంపు లోతు వంద మీట‌ర్ల కంటే ఎక్కువ ఉంటే అండ‌ర్ గ్రౌండ్ ఎక్కువ అనుకూలం. ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది. అందుకని వీలైన‌న్ని అండ‌ర్ గ్రౌండ్ పంపులు, టన్నెల్స్ పెట్టాం. తెలంగాణ‌లో మంచి గ్రానైట్ రాయి అందుబాటులో ఉండ‌డం సాంకేతికంగా అనుకూల‌మయ్యింది. సాధార‌ణంగా ఇటువంటి ప్రాజెక్టు రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డం అరుదు." అని తెలిపారు.
సాగర సంగమం వద్ద ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే.. తినటానికి కాదు
తెలంగాణ: ఆర్‌టీసీ చరిత్రలో చివరి సమ్మె ఇదే అవుతుందా?
కాళేశ్వరం ప్రాజక్టు
భారీగా నిధుల కేటాయింపు
కాళేశ్వ‌రం ప్రాజెక్టు రీడిజైన్ త‌రువాత అంచ‌నా వ్య‌యం రూ.80,500 కోట్ల‌కు పెరిగింది. ప్రాజెక్టును తొంద‌ర‌గా పూర్తి చేయ‌డం కోసం బ్యాంకు లోను తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.
నాబార్డు, ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థ‌లు కాకుండా, క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు సాగునీటి ప్రాజెక్టుకు లోన్లు ఇవ్వ‌డం విశేషం.
ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తొంద‌ర‌గా పూర్తి చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది.
లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.4,685 కోట్లు విడుద‌ల‌య్యాయి. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. దాంట్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3,473 కోట్లు వ‌చ్చాయి.
"గోదావ‌రి మీద ఏ బ్యారేజీ కూడా ఐదు నుంచి ఐదున్న‌రేళ్ల లోపు పూర్తి చేయ‌లేదు. కానీ, మేం దీన్ని రెండేళ్ల‌లో పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్రాజెక్టు తొంద‌ర‌గా పూర్తి అయితే, ఫ‌లితాలు తొంద‌ర‌గా అందుతాయి. ఆల‌స్యం అయ్యే కొద్దీ ఖ‌ర్చు పెరుగుతుంది. ధ‌ర‌ల పెరుగుద‌ల రేటు 15 నుంచి 16 శాతం ఉంటే, బ్యాంకు వ‌డ్డీ 8 నుంచి 10 శాతం ఉంటుంది. అందుకే, రాష్ట్ర ప్ర‌భుత్వ గ్యారెంటీతో బ్యాంకు నుంచి నిధులు స‌మ‌కూర్చాం. దీని వ‌ల్ల.. పంటలకు తొంద‌ర‌గా నీరిచ్చి రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆప‌వ‌చ్చు. ప్ర‌భుత్వంపై భారం కూడా త‌గ్గించ‌వ‌చ్చు. జీఎస్‌డీపీ కూడా పెరుగుతుంది."అని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.
నిర్వాసితుల అభ్యంతరాలు
ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. వారు తాజాగా మ‌రోకేసు వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది.
టూరిజం శాఖ 'కాళేశ్వరం ప్యాకేజీ'
తెలంగాణ టూరిజం కార్పొరేష‌న్ ఇటీవల ఒక కొత్త టూరిస్ట్ స‌ర్వీస్ ప్రారంభించింది. ఈ ట్రిప్పులో భాగంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యటకులకు చూపిస్తారు. ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చూపెట్టడానికి టూరిజం కార్పొరేష‌న్ బ‌స్సు న‌డ‌ప‌డం విశేషమే.
అంతేకాదు, వివిధ రంగాల‌కు చెందిన వారిని, రాజ‌కీయ, ప్ర‌భుత్వ వ‌ర్గాల వారిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు చూసేలా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. అక్క‌డ‌కు వ‌చ్చిన వారికి ఇంజినీర్లు ద‌గ్గ‌ర ఉండి ప్రాజెక్టు నిర్మాణాల గురించి వివ‌రిస్తున్నారు.
ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్‌లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
కాళేశ్వరం ప్రాజక్టు
చిత్రం శీర్షిక
తెలంగాణ పర్యాటక శాఖ కాళేశ్వరం ప్రాజక్టు కోసం ప్రత్యేకంగా పర్యటక ప్యాకేజీని ఏర్పాటు చేసింది
అంకెల్లో ప్రాజెక్టు వివరాలు
నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
మామూలు కాలువల‌ పొడవు: 1531 కి.మీ
సొరంగాలు (భూగ‌ర్భ కాలువ‌లు) పొడ‌వు: 203 కి.మీ
పైపులైన్ పొడ‌వు: 98 కి.మీ
మొత్తం లిఫ్టులు: 20
పంపు హౌజ్‌లు: 19
అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం: 139 మెగావాట్ల‌వి 7 పంపులు (రామ‌డుగు వ‌ద్ద‌)
పాత జలాశయాలు: 5 (ఇప్ప‌టికే నిర్మించినవి లేదా స‌హ‌జ‌మైన‌వి)
కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
13 జిల్లాల్లో వ‌చ్చే కొత్త ఆయ‌క‌ట్టు: 18,25,700 ఎక‌రాలు
శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగ‌ర్, సింగూరుల పాత ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ: 18,82,970
(18.82 లక్షల ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి)
కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయక

KERALA LATEST NEWS




న్యూఢిల్లీ: భారీ వర్షలు, వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద మంగళవారం ఈ నిధులను విడుదల చేసింది.

కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది.
భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్‌, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 No GST, customs duty on relief materials in Kerala along with Rs 600 crores
కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొస్తున్నారు.

కేరళకు సాయం చేస్తే..: జీఎస్టీ లేదు

ఇతర రాష్ట్రాల నుంచి కేరళ రాష్ట్రానికి పంపే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ, జీఎస్టీని తీసివేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. దీనిపై తదుపరి నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించిన తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన డిసెంబర్‌ 31, 2018 వరకు వర్తిస్తుందని ఆయన వివరించారు.
ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను తగ్గించాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో ఇప్పటికే సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. దెబ్బతిన్న గ్రామాల్లో 90 శాతం ఫోన్‌ కనెక్టివిటీ పునరుద్దరించినట్లు అధికారులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MJ7UOH
via IFTTT

LATEST NEWS

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య నియమితులయ్యారు.


బీహార్‌ గవర్నర్‌గా లాల్‌జీ టాండన్‌, జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌గా బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న సత్యపాల్‌ మాలిక్‌‌ను నియమించారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా పదవీకాలం జూన్ 28నే ముగియడంతో సత్యపాల్‌ను నియమించారు.
Satyapal Malik appointed as next Governor of Jammu and Kashmir

సిక్కిం గవర్నర్‌గా మేఘాలయ గవర్నర్ పనిచేస్తున్న రంగా ప్రసాద్‌ బదిలీ అయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌ బదిలీ నియమితులయ్యారు. త్రిపురకు.. హర్యానా గవర్నర్‌ కప్తాన్‌ సింగ్‌ సోలంకిని బదిలీచేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Lb8r77
via IFTTT

LATEST NEWS

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది తమ మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వ్యాపార సంస్థలు, ఎన్జీవోలు, చిన్నారులు కూడా మేముసైతం అంటూ కేరళకు సాయమందిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OUWoNM
via IFTTT

LATEST NEWS

అమరావతి:జర్నలిస్టులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం పేర్ల నమోదు కార్యక్రమాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. జర్నలిస్టుల పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైబ్ రూపొందించిన సంగతి తెలిసిందే... అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లోనే పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జర్నలిస్టులకు కూడా సొంతిల్లు ఉండాలనే సదుద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ స్కీమ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2nU396X
via IFTTT

SOCIAL MEDIA

ప్రేమించడం గొప్ప కాదు .ఆ ప్రేమను గెలిపించుకొని వివాహం చేసుకోవడమే గొప్ప అదే నిజమైన ప్రేమ అనుకున్నారు కర్ణాటక కు చెందిన కిరణ్ కుమార్ మరియు అంజన .స్టోరీలోకి వెళ్తే... కర్ణాటకలో ఓ ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అమ్మాయి తరుపున తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి

from Latest Social Media News in Telugu - Gizbot Telugu https://ift.tt/2OS5R8x

CINEMA PRO.APK free Download

Bonalu in manthani

https://www.youtube.com/watch?v=dP2IYxxJ4Cw
Telangana bonalu in manthani

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare https://www.youtube.com/watch?v=IFPOvlfBhaw